తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఈ ఆరు జిల్లాల్లో రెండు రోజుల పాటుగా మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. మార్చి 12, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 14, ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఆయా జిల్లాల పరిధిలోని వైన్స్, క్లబ్స్, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ