ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లిలో వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్కు మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలలో ఎమ్మెల్యేలు మరింత సమయం వెచ్చించాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణమే పరిష్కరించటానికి ప్రయత్నాలు చేయాలని సూచించారు. అయితే గత సమీక్ష కన్నా ఈసారి పరిస్థితిలో కొంత పురోగతి కనిపించిందని, దీనిని ఇలాగే కొనసాగించాలని కోరారు. ఇంకా కొందరు తీరు మార్చుకోవాలని, చురుకుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ సీఎం జగన్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY