తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణ (ఉద్ఘాటన)కు ముహూర్తం ఖరారైంది. ఈనెల 28న మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాలకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు మహాకుంభాభిషేకం, సాయంత్రం సమయంలో శాంతి కల్యాణం కూడా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. 21వ తేదీ ఉదయం 9 గంటలకు విశ్వక్సేనుడికి తొలిపూజ జరుగనుంది. 21 నుంచి 28వ తేదీ వరకు పాంచరాత్రాగమ శాస్త్ర పద్ధతిలో ఉద్గాటన పర్వాలు నిర్వహించనున్నారు. 21 నుంచి 28 వరకు బాలాలయంలో పంచకుండాత్మక హోమం తలపెట్టనున్నారు. ఉద్ఘాటన పూజల నేపథ్యంలో.. శుక్రవారం నుంచి బాలాలయంలో ఆర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయితే బాలాలయానికి బదులుగా పాతగుట్ట ఆలయంలో ఆర్జిత సేవలు జరిపించుకోవచ్చని ఆలయ అర్చకులు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ