మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ కో–ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్టు చేయించుకుని, పాజిటివ్ గా నిర్దారణ అయిన వెంటనే ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ కు వచ్చి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జి అయ్యాను” అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
తనతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులను దయచేసి ఇతరులతో వేరుగా ఉండి ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. అలాగే తనకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, అస్సలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రవీణ్ కుమార్ తెలిపారు. మరోవైపు ఆగస్టు 8న నల్గొండలోని ఎన్.జీ కళాశాలలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) లో చేరిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ