గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసుల నుంచి మరోసారి నోటీసులు అందాయి. గురువారం 41ఏ సీఆర్పీ కింద ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత ఏడాది ఆగస్టులో అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తాజాగా ఆ కేసు మంగళహాట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసులు నోటీసులు పంపారు.
గత ఏడాది ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పీడీ యాక్ట్ నమోదును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ పై పలు దఫాల విచారణ అనంతరం రాజాసింగ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE