సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం వేడుకలు జరుపనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ తెలిపింది. అలాగే రథసప్తమి పర్వదినం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్టు చెప్పారు. ఈ మేరకు టీటీడీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
వాహన సేవల వివరాలు (జనవరి 28న) :
- ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం
- ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం
- ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు – గరుడ వాహనం
- మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం
- మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం
- సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
- సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
- రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE