హైదరాబాద్ బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో ఇటీవల వెలుగులోకివచ్చిన చిన్నారిపై అఘాయిత్యం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తాజాగా ఈ ఘటనపై ప్రముఖ అగ్ర నటుడు, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. పసిబిడ్డపై జరిగిన అఘాయిత్యం తనను ఎంతో కలచివేసిందని చిరంజీవి అన్నారు.
“నాలుగేళ్ల పసిబిడ్డ పై స్కూల్ లో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం నన్ను బాగా కలచివేసింది. ఆటవిక సంస్కృతి నుండి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY