దేశంలో కరోనా చికిత్సలో భాగంగా పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వం కేటాయింపులు సహా ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరతను తగ్గించడంలో తనవంతుగా సాయం చేసేందుకు ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంక్ లను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ ఆక్సిజన్ బ్యాంకుల కార్యకలాపాలు ఒక వారం వ్యవధిలో ప్రారంభం కానున్నాయి. చిరంజీవి తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ఆక్సిజన్ బ్యాంకులకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి విశిష్టమైన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ