ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్ధలకు సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 12నుంచి 18వ తేదీ వరకు సెలవులుగా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం మొదట ప్రకటించిన షెడ్యూల్ లో మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ఉండగా.. 17వ తేదీన ‘ముక్కనుమ’ పండుగ ఉన్నందున ఆరోజున సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి విజ్ఞప్తి రావడంతో విద్యాశాఖ అధికారులు పునరాలోచించారు. దీంతో ఈ నెల 12నుంచి 18వ తేదీ వరకు సెలవులుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అలాగే సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి 19వ తేదీన పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE