కరోనా కారణంగా చనిపోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీప్యూటీ డీఎంహెఛ్ డాక్టర్ నరేష్ భార్య పావనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం నాడు గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం జీవో కాపీని అందించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఉద్యోగం కల్పించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో ఈ ఉద్యోగం ఇప్పించారని, కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.
వైద్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మానవతా కోణంలో ఆలోచించి తనకు గెజిటెడ్ ఉద్యోగం ఇచ్చినందుకు డాక్టర్ నరేష్ భార్య పావని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు ధన్యవాదాలు తెలిపింది. మంత్రిని కలిసిన వారిలో పావని తండ్రి సత్యనారాయణ, పిల్లలు సంజని, శరణితో పాటుగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు డా కత్తి జనార్ధన్, సెక్రెటరీ జనరల్ డాక్టర్ పూర్ణ చందర్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాంబాబు, సెక్రేటరీలు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ కిరణ్ లు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ