ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును పొడిగించింది. ఈ మేరకు ఎఫ్సీఐ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వానికి తెలిపిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బుధవారం ప్రకటించారు. తద్వారా తెలంగాణకు రూ. 180 కోట్ల లబ్ధి జరిగిందని మంత్రి కమలాకర్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఎఫ్సీఐతో తెలంగాణ పౌరసరఫరాల శాఖ జరిపిన సంప్రదింపులు సత్ఫాలితాన్ని ఇచ్చాయని వెల్లడించారు. తెలంగాణ రైతుల మేలు కోసం నిరంతరం కృషి చేస్తామని, రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అనుక్షణం తపిస్తూనే ఉంటామని మంత్రి గంగుల స్పష్టం చేశారు.
ప్రభుత్వ యంత్రాంగం చొరవతో 2021-22 వర్షాకాల సీజన్ బియ్యాన్ని అందించేందుకు ఈ నవంబర్ 30 వరకు గడువును పెంచిందని మంత్రి కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే గత యాసంగి లోని బాయిల్డ్ బియ్యం తీసుకునేందుకు కూడా ఒప్పుకుందని, అప్పుడు సేకరించినదానికన్నా మరో నాలుగు లక్షల టన్నులకు అనుమతిచ్చిందని మంత్రి తెలిపారు. దీంతో ఎఫ్సీఐ గతంలో సేకరించిన ఎనిమిది లక్షలు టన్నులతో కలిపి మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఆమోదం తెలుపడంతో రాష్ట్ర ఖజానాకు దాదాపు 180 కోట్లు లబ్ధి చేకూరనుందని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇక త్వరలోనే మరోసారి వానాకాలం పంట సేకరణ చేపడుతామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,100కు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY