ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 28, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రాష్ట్రాల హోం మంత్రుల చింతన్ శివర్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో హర్యానాలోని సూరజ్కుండ్లో చింతన్ శివిర్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రాల హోం సెక్రటరీలు మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీలు) మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్ లు), సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ (సీపీఓలు) డైరెక్టర్ జనరల్లు కూడా చింతన్ శివర్కు హాజరుకానున్నారు.
ప్రధాని మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన పంచప్రాణ్కు అనుగుణంగా, అంతర్గత భద్రత సంబంధిత విషయాలపై విధాన రూపకల్పనకు జాతీయ దృక్పథాన్ని అందించడానికి హోం మంత్రుల చింతన్ శివిర్ ఒక ప్రయత్నమని పేర్కొన్నారు. ఈ శివిర్ సహకార సమాఖ్య స్ఫూర్తితో, కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలలో వివిధ వాటాదారుల మధ్య ప్రణాళిక, సమన్వయంలో మరింత సమన్వయాన్ని తెస్తుందన్నారు. పోలీసు బలగాల ఆధునీకరణ, సైబర్ క్రైమ్ మేనేజ్మెంట్, నేర న్యాయ వ్యవస్థలో ఐటీ వినియోగం పెరగడం, ల్యాండ్ బోర్డర్ నిర్వహణ, తీరప్రాంత భద్రత, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై ఈ శివిర్ లో చర్చించనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY