రేజింతల్ సిద్ధి వినాయక ఆలయ అభివృద్ధికి రూ.50లక్షల మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో కొలువైన సిద్ధి వినాయక దేవాలయాన్ని మంత్రి హరీష్ రావు నేడు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం రేజింతల్ చేరుకున్న మంత్రి హరీష్ రావుకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆపై ఆలయంలో మంత్రి హరీష్ రావు సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ… ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజని, ఈ శుభ దినాన ఇక్కడకు వచ్చి స్వయంభూ వియకుడిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఈ సిద్ధి వినాయక ఆలయ అభిృద్ధికి ప్రభుత్వం తరఫునుంచి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి విఘ్నాలు ఉన్నా తొలగిపోయి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని, ఈ క్రమంలో ఎలాంటి విఘ్నాలు ఉన్నా దేవుని దయతో తొలగిపోవాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ సిద్ధి వినాయకుడిని ప్రార్ధించినట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ