రెండు రోజుల ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈరోజు మహబూబాబాద్లో మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఇక్కడి 100 పడకల జిల్లా హాస్పిటల్ని 330 పడకల కెపాసిటీ గల హాస్పిటల్గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నందున, దీనికోసం రూ. 4 కోట్ల నిధులను మంజూరు చేశారు. అలాగే రేడియాలజీ ల్యాబ్ నిర్మాణం కోసం మరో రూ. 75 లక్షల నిధుల విడుదలకు అనుమతి ఇచ్చారు. ఇంకా జిల్లా హాస్పిటల్ లోని మొదటి అంతస్తులో సుమారు రూ. 55 లక్షలతో నిర్మించిన 41 పడకల జనరల్ వార్డ్ను ప్రారంభించారు. ఈ హాస్పిటల్ లోనే కొత్తగా రూ. 32 లక్షల నిధులతో నిర్మించిన పిల్లల సంరక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో ఇతర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్లు కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ