మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. మునుగోడులో మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా, 2,25,192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 686 పోల్ అయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ పార్టీకి 97006 (42.95 శాతం), బీజేపీకి 86697 (38.38 శాతం), కాంగ్రెస్ కు 23,906 (10.58 శాతం) ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తన సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. కాగా మునుగోడు ఫలితంపై టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ, సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అని ట్వీట్ చేశారు.
“చైతన్యానికి మారుపేరైన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ కుట్రలకు మధ్య జరిగిన ధర్మ యుద్ధంలో, సీఎం కేసీఆర్ వెంట నిలిచి, అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు పలికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన మునుగోడు ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన నాయకత్వ స్ఫూర్తితో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా అహర్నిశలు శ్రమించిన తీరుకు అభినందనలు. బీజేపీ కుట్రలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడటంలో మాకు ఆద్యంతం శక్తిని, స్ఫూర్తిని నింపిన మా నాయకుడు కేసీఆర్ కు ధన్యవాదాలు” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE