కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జనవరి 10వ తేదీ నుంచి తెలంగాణలో హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మరియు 60 ఏళ్లు వయసుపైబడి కోమార్బిడిటీస్ (సహ-అనారోగ్యాలు) ఉన్నవారికీ ప్రికాషన్ డోస్ (కోవిడ్ వ్యాక్సిన్) అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రికాషన్ డోసుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయాకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం లేఖ రాశారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు మరియు ప్రికాషన్ డోసు మధ్య వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని లేఖలో కోరారు.
హెల్త్కేర్ వర్కర్స్ కు సంబంధించి రెండో డోసు మరియు ప్రికాషన్ డోసు మధ్య వ్యవధిని 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే కోమార్బిడిటీస్ తో సంబంధం లేకుండా 60 ఏళ్లు వయసుపైబడిన పెద్దలందరికి ప్రికాషన్ డోసు పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక 18 సంవత్సరాలు దాటినా ప్రతి పౌరుడికి బూస్టర్ డోసు అందించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ చర్యలు కోవిడ్-19 ఇన్ఫెక్షన్తో వచ్చే తీవ్రమైన అనారోగ్యం మరియు మరణాల నుండి ప్రజలను రక్షించడానికి సహాయపడతాయని పేర్కొన్నారు. అమెరికా, యూకే వంటి దేశాలు అమలుచేస్తున్న బూస్టర్ డోస్ పాలసీస్ ఆధారంగా ఈ ప్రతిపాదనలు చేస్తునట్టు మంత్రి హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF