టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని, పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ముందుగా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు మంగళవారం ఉదయం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. దయచేసి సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి” అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు, టీడీపీ నాయకులు, సినీ ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Wishing a speedy recovery & good health for Sri @ncbn garu.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 18, 2022
I’ve tested positive for COVID with mild symptoms. I have quarantined myself at home and taking all the necessary precautions.
I would request those who came in contact with me to get themselves tested at the earliest. Please be safe and take care.
— N Chandrababu Naidu (@ncbn) January 18, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF