యాదాద్రిలో సోమవారం మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా నేడు అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం యాదాద్రిలో చేపట్టిన ఏర్పాట్లు, నిర్వహణ తదితర అంశాలపై శనివారం వివిఐపి అతిధి గృహంలో సమీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్ పక్కాగా ఉండాలని, పొలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే, భక్తులు భారీ సంఖ్యలో రావొచ్చని, వారికి త్రాగు నీరు, భోజన వసతి సరిగా అందేలా చూడలని ఆదేశించారు. ఎండలు పెరిగినందున భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రధానంగా బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, హెల్ప్ డెస్క్ ఏర్పాటు వంటివి పోలీసుల పర్యవేక్షణలో కొనసాగాలని సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ మహేశ్ భగవత్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ