సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో కూడా వీటిని నిషేధించే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుకానున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తుందన్నారు. దీనిని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యామ్నాయ వస్తువులను ప్రోత్రహించే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రజలను చైతన్య పరచడంతో పాటు కంపోస్టబుల్ ప్లాస్టిక్ వస్తువుల తయారీకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వన్ టైం సర్టిఫికెట్లను జారీ చేస్తుందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ