తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న2 రాజ్యసభ స్థానాలకు మే 24, మంగళవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మే 24 నుంచే ప్రారంభమవగా, నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు మే 31గా నిర్ణయించారు. ముందుగా ఈ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ పార్థసారథి రెడ్డి పేర్లను టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. దీంతో బుధవారం ఉదయం టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారధి రెడ్డి రాజ్యసభకు తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరూ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ గాయత్రీ రవితో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ ల యొక్క రాజ్యసభ పదవీకాలం జూన్ 21, 2022తో పూర్తవనుంది. ఈ నేపథ్యంలోనే ఈ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1న నామినేషన్ల పరిశీలన జరగనుంది, అలాగే జూన్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక ఈ రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని ఈసీ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF