ఆంధ్రప్రదేశ్ లోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఏపీ మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఈ సమీక్షకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, సీఎస్ జవహర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక సూచనలు ఇచ్చారు.
మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక ఆదేశాలు, సూచనలు..
- రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలలో ఖాళీగా ఉన్న 61 సీడీపీఓ పోస్టుల భర్తీకి ఆమోదం.
- ఈ పోస్టుల నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపిన అధికారులు, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశం.
- అంగన్వాడీలలో పిల్లలకు అందించే న్యూట్రిషన్ కిట్ నాణ్యతతో ఉండాలి.
- అలాగే అంగన్వాడీలలో భోజనం కోసం నాణ్యమైన సార్టెక్స్ రైస్ అందించాలి.
- ఇటీవల నియమితులైన సూపర్వైజర్లతో తరచుగా అంగన్వాడీలలో తనిఖీలు నిర్వహించాలి.
- అంగన్వాడీల స్థాయి నుంచే పిల్లల్లో విద్యతో పాటు భాషపై కూడా పట్టు ఉండేలా చర్యలు చేపట్టాలి.
- అంగన్వాడీలలో పనితీరుని పర్యవేక్షించేందుకు సూపర్వైజర్స్ వ్యవస్థను సమర్ధవంతంగా వినియోగించుకోవాలి.
- ‘నాడు-నేడు’ పథకం కింద చేపడుతున్న వివిధ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి.
- ఏపీ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గృహనిర్మాణం మరియు మహిళా శిశు సంక్షేమ శాఖకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఆయా విభాగాలు అత్యుత్తమ పనితీరు కనబరచాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ