తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడం చారిత్రాత్మకమని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. భారతదేశంలో మరెక్కడా లేని విదంగా దళితులను సుసంపన్నం చేసేందుకు గాను దళితబంధు పధకాన్ని ప్రవేశ పెట్టి దళితుల పక్షపాతిగా చాటుకున్న సీఎం కేసీఆర్, తాజాగా సచివాలయానికి డా.బీఆర్ అంబేద్కర్ పేరుపెట్టి దళిత పక్షపాతి అన్న పేరును సార్ధకం చేసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, భారత రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ అందించిన అరుదైన గౌరవంగా మంత్రి అభివర్ణించారు. ఈ నిర్ణయం యావత్ భారతదేశానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తోందన్నారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కుడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY