పీవీ, ఎన్టీఆర్ లపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఖండిస్తున్నా: మంత్రి కేటిఆర్

Akbaruddin Owaisi, GHMC, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, KTR Condemned MLA Akbaruddin Owaisi Comments, Mango News, Minister KTR, MLA Akbaruddin Owaisi, MLA Akbaruddin Owaisi Comments, MLA Akbaruddin Owaisi Comments on PV Narasimha Rao and NTR

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్‌ ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు” అని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.

ముందుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ, హుస్సేన్ సాగర్ పై ఉన్న పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని వ్యాఖ్యలు చేశారు. “‘నగరంలో అక్రమ కట్టడాలు, ఇళ్లును కూల్చేస్తామని రాష్ట్రప్రభుత్వం అంటుంది. ఒకప్పుడు 4,700 ఎకరాలు ఉన్న హుస్సేన్‌సాగర్‌ ఈరోజు 700 ఎకరాలు కూడా లేదు. దమ్ముంటే హుస్సేన్‌సాగర్‌పై ఉన్న పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలి” అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + twenty =