రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చోటు చేసుకున్న ఘటన తనను భయాందోళనకు గురిచేసిందని తెలిపారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. దీనిపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉదయ్పూర్ హత్య ఘటన చాలా బాధాకరమని, ఆ క్రూరమైన హత్య వెనుక ఉన్న కారణం తనను షాక్కు గురి చేసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక హింసకు సమాజంలో చోటు లేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి క్రూరమైన హత్యలకు పాల్పడే నేరస్తులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అత్యంత కఠినమైన శిక్ష విధించాలని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో కోరారు.
Horrified & shocked beyond belief at the ghastly murder in Udaipur
This barbaric violence has no place in civil society & and the most stringent punishment should be given to the perpetrators through fast track court#UdaipurHorror
— KTR (@KTRTRS) June 28, 2022
అసలు ఉదయ్పూర్లో ఏం జరిగిందంటే.. మంగళవారం ఉదయ్పూర్లోని ధన్మండీ ఏరియాలోని ఒక దుకాణంలోకి ఇద్దరు వ్యక్తులు చొరబడి ఓ టైలర్ను దారుణంగా హత్య చేశారు. దారుణంగా కత్తితో తల నరికి మొండెం నుంచి వేరు చేశారు. అంతేకాకుండా ఆ హత్య వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త నగరమంతా దావాలనంలా వ్యాపించింది. ఐయే ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నగరంలో భారీగాబలగాలు మోహరించి కర్ఫ్యూ విధించారు. 24 గంటల పాటు అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ప్రజలు సంయమనం వహించాలని, ఈ హత్యకు సంబంధించిన వీడియోలను షేర్ చేయొద్దని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే విషయం తీవ్రతను అర్ధం చేసుకున్న కేంద్ర హోంశాఖ ఎన్ఐఏ బృందాన్ని ఉదయ్పూర్కు పంపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ