దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్)-2023 వార్షిక సదస్సు వేదికగా పలు సంస్థల నుంచి తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ అధికారుల బృందం ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతూ పెట్టుబడుల వేట కొనసాగిస్తుంది. ఈ క్రమంలో భారతీ ఏయిర్ టెల్ గ్రూప్ రూ.2 వేల కోట్లతో తెలంగాణలో భారీ పెట్టుబడిని ప్రకటించింది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను రూ.2 వేల కోట్లతో హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్టు దావోస్ వేదికగా భారతీ ఏయిర్ టెల్ గ్రూప్ ప్రకటించింది. తన అనుబంధ సంస్థ అయిన నెక్స్ ట్రా ద్వారా ఈ 60 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటాసెంటర్ ను నెలకొల్పుతున్నట్టు భారతీ ఏయిర్ టెల్ తెలిపింది.
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏర్పాటైన తెలంగాణ పెవిలీయన్ లో మంత్రి కేటీఆర్ తో భారతీ ఏయిర్ టెల్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ భారతీ మిట్టల్ లు సమావేశమై చర్చించిన అనంతరం హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఏయిర్ టెల్-నెక్స్ ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దేశంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ లకు హైదరాబాద్ హబ్ గా మారిందని, ఏయిర్ టెల్ తాజా పెట్టుబడితో తాము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయని నమ్ముతున్నానని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE