నేడు ఎమ్మెల్సీలు, ఎంపీలతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ

KTR About Municipal Elections, KTR Latest News, KTR Meeting With MPs And MLAs, Mango News Telugu, Political Updates 2020, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, TRS Working President KTR
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 25, శనివారం నాడు టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జనవరి 27న జరగబోయే మేయర్‌లు, ఛైర్‌పర్సన్‌లు, డిప్యూటీ మేయర్‌లు, వైస్‌ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక పక్రియ పై చర్చించనున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఎక్స్‌అఫీషియో ఓట్లపై నిర్ణయం తీసుకొన్నారు. టిఆర్ఎస్ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు కలిపి 15 మంది ఉండగా, ఎమ్మెల్సీలు 32 మంది ఉన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలకూ ఓటు హక్కు ఉంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా మేయర్, ఛైర్‌పర్సన్‌ అభ్యర్థుల పేర్లను ఎంపిక చేసి, సీల్డ్‌ కవర్లలో భద్రపరచి ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు అందజేయనున్నారు. ఈనెల 27న తేదీనే టిఆర్ఎస్ మేయర్‌లు, ఛైర్‌పర్సన్‌ల అభ్యర్థుల పేర్లు వెల్లడికానున్నాయి.

[subscribe]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 14 =