తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా తన పర్యటన విజయవంతమైందని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇక ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి మొత్తం రూ. 21 వేల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. పర్యటనలో భాగంగా 4 రోజుల్లో మొత్తం 52 వాణిజ్య సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు సహా మరో 2 ప్యానెల్ చర్చలు జరిగినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. వీటిలో సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో మరో 3 డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు రావడం, అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.750 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకోవడం వంటివి ఉన్నాయి.
All thanks to my wonderful Team led ably by @jayesh_ranjan Garu 👏 https://t.co/uA6V2yY0S7
— KTR (@KTRTRS) January 21, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE