తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాలు, వరదల వల్ల పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం కింద ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు, స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు గతఏడాది కూడా భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరు హైదరాబాద్ రావద్దని, సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు, అభిమానులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY