గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న, ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో త్వరలో వారు నిర్వహించనున్న ఆధ్యాత్మిక సమ్మేళనానికి హాజరు కావాల్సిందిగా రామచంద్ర మిషన్ ప్రస్తుత ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్, సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. వారు నిర్వహిస్తున్న సామాజిక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE