దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్‌ల‌ను ప్రారంభించిన మంత్రి కేటిఆర్ ‌

Cable Stayed Bridge Across Durgam Cheruvu and Elevated Corridor, Durgam Cheruvu Bridge, durgam cheruvu bridge inauguration, Durgam Cheruvu Bridge News, Durgam Cheruvu Cable Bridge, durgam cheruvu cable bridge inauguration, Durgam Cheruvu Cable Bridge News, Minister KTR Inaugurated Cable Stayed Bridge Across Durgam Cheruvu, Stay Bridge on Durgam Cheruvu

హైదరాబాద్ నగరంలో రూ.184 కోట్ల‌తో నిర్మించిన‌ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జితో పాటు, రోడ్ నెంబర్ 45 నుండి దుర్గంచెరువు వరకు రూ.150 కోట్ల‌తో నిర్మించిన 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ లను శుక్ర‌వారం సాయంత్రం రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎంపి డా.జి.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌, జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజ‌నీర్ శ్రీ‌ధ‌ర్‌, ఎస్‌.ఇ. వెంక‌ట‌ర‌మ‌ణ‌, స్థానిక కార్పొరేట‌ర్లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =