భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో ఈ నెల 2, 3 తేదీలలో రెండు రోజులపాటు జరుగనున్నాయి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేక మంది జాతీయ స్థాయి ప్రతినిధులు ఈ కార్యవర్గ సమావేశానికి రానున్నారు. ఈ క్రమంలో పేరొందిన నేతలు ఒక్కొక్కరుగా హైదరాబాద్కు చేరుకోవడం ప్రారంభించారు. దీనిలో ముందుగా యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య నిన్న హైదరాబాద్ వచ్చారు. ఇక ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.
ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర నేతలు ఘనస్వాగతం పలికారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు రాష్ట్ర నేతలతో కీలక చర్చలు జరిపిన నడ్డా.. అనంతరం విమానాశ్రయం నుంచి బస చేయనున్న నోవాటెల్ హోటల్ వరకు భారీ ర్యాలీ తీశారు. ఇక ర్యాలీలో నడ్డాకు ఇరువైపులా బండి సంజయ్, బీజేపీ ముఖ్యనేత విజయశాంతి నిలుచున్నారు. ఈ ర్యాలీ కోసం రాష్ట్ర నలుమూలలనుంచి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, జిల్లా స్థాయి నాయకులు వందలమంది నగరానికి చేరుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ