తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1511 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 14, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,04,880 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 12 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3496కి పెరిగింది. కొత్తగా 2175 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 5,80,923 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 173, ఖమ్మంలో 139, నల్గొండలో 113 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూన్ 14, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,68,34,591
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,04,880
- కొత్తగా నమోదైన కేసులు : 1511
- నమోదైన మరణాలు : 12
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 5,80,923
- కరోనా రికవరీ రేటు: 96.03%
- యాక్టీవ్ కేసులు: 20,461
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 3496
- కరోనా మరణాల రేటు: 0.57%