తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉస్మాన్సాగర్ గండిపేట వద్ద ల్యాండ్ స్కేప్ పార్కును ప్రారంభించారు. రూ.35.6 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెఛ్ఎండీఏ) గండిపేట వద్ద ల్యాండ్ స్కేప్ పార్కును నిర్మించింది. ఈ పార్కును ఎంట్రెన్స్ ప్లాజా, వాక్వేస్, సెంట్రల్ పెవిలియన్, టికెటింగ్ కౌంటర్లు, ఆర్ట్ పెవిలియన్, ప్లవర్ టెర్రస్, ఇన్నర్ యాక్సెస్ రోడ్డు, పిక్నిక్ స్పాట్లు, 1200 సీట్ల సామర్థ్యం గల ఓపెన్ ఎయిర్ థియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులతో అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
గండిపేటకు వచ్చే సందర్శకులను ఆకట్టుకోవడంతో పాటుగా హైదరాబాద్ నగరం గ్రీన్ ల్యాండ్ స్పేస్ కు మరో విలువైన ప్రదేశంగా ఈ పార్కు నిలవనుంది. అలాగే హిమాయత్సాగర్ సమీపంలో కొత్వాల్గూడ వద్ద 80 ఎకరాల్లో రూ.75 కోట్ల వ్యయంతో నిర్మించే ఎకో పార్కు నిర్మాణ పనులకు కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ల్యాండ్ స్కేప్ పార్కు ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్ తో పాటుగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జెడ్పి చైర్మన్ అనిత, పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY