తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఇప్పటికే కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఇటీవల తనను కలిసిన వారంతా ఇతరులతో వేరుగా ఉండి, కరోనా పరీక్షలు చేయించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. తన ఆరోగ్యం పట్ల కార్యకర్తలు, అభిమానులు ఆందోలన చెందవద్దని కోరారు. కరోనా నుంచి కోలుకోగానే కార్యకర్తలను కలుసుకుంటానని భట్టి విక్రమార్క తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ