రంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Minister KTR Lays Foundation Stone for Various Development Works in Maheshwaram Constituency

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ, జల్ పల్లి, మీర్ పేట్, బడంగ్ పేట్ మున్సిపాలిటీల పరిధిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో, పట్టణంలో నిర్మించే సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ మరియు మంచినీటి సరఫరా కోసం చేపట్టే పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే రోడ్ల నిర్మాణం, విస్తరణ, మంచినీటి సరఫరా, వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం మరియు రాక్ గార్డెన్ నిర్మాణం వంటి వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గే మల్లేశం మరియు పురపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బడంగ్ పేట్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఒక్క మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోనే మంచి నీళ్ల కోసం బడంగ్ పేట్ లో రూ.82 కోట్లు, మీర్ పేట్ లో రూ.24 కోట్లు, జల్ పల్లిలో రూ.72 కోట్లు, తుక్కుగూడలో రూ.29 కోట్లు కలిపి మొత్తం రూ.207 కోట్లను ప్రభుత్వం చేసిందన్నారు. అలాగే మురికినీటి కాల్వలను, వరద నీటి కాల్వలను బాగుచేసేందుకు మహేశ్వరం నియోజకవర్గానికి రూ.92.89 కోట్లు మంజూరు చేశామన్నారు. రహదారుల కోసం రూ.58.20 కోట్లు, సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ సముదాయాలు కోసం రూ.13 కోట్లు కేటాయించామన్నారు. ఈ రోజు మహేశ్వరం పరిధిలో మొత్తం 371.09 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 19 =