గ్లోబల్ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను నిలిపేందుకు నాలుగు రోజుల యూకే పర్యటన కోసం లండన్ చేరుకున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు లండన్లో ఘనస్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయంలో తెలంగాణ ఎన్నారైల నుంచి కేటీఆర్కు ఘన స్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయంలో పలువురు ఎన్నారైలు మరియు యూకే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ విభాగం సభ్యులు స్వాగతం పలికారు. అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మంత్రికి లండన్లో స్వాగతం చెప్పారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా తెలంగాణ ఎన్నారైలు లండన్ నగరంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు.
Thank you to the affectionate NRIs of Telangana in UK for their overwhelming welcome 😊
Special thanks to @Anil_trs Garu who has been spearheading NRI TRS in UK for over a decade & @ASHOKDUSARI Garu NRI TRS UK president who gave me a ride in his car with special number plate 😄 pic.twitter.com/N8uxk6h21B
— KTR (@KTRTRS) May 18, 2022
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ యూకేలో ఉన్న ప్రవాస భారతీయులు థ్యాంక్స్ చెప్పారు. తనకు లభించిన ఘన స్వాగతానికి మంత్రి కేటీఆర్ ట్విటర్లో ప్రవాస తెలంగాణ ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించనున్న వరుస సమావేశాలలో మంత్రి పాల్గొననున్నారు. పలు ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఆటోమోటివ్ పరిశ్రమల అధిపతులతో సమావేశమవనున్నారు. యూకే పర్యటన అనంతరం మే 22 నుంచి 26 వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ బృందం పయనమవనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ