తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన 2020-21 వార్షిక నివేదికను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జలమండలి ఎండీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ 2020-21 వార్షిక నివేదికలో మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో ప్రధానమైన సాఫల్యాలను పొందుపరిచారు. కోవిడ్ నివారణ చర్యలు, మౌలిక సదుపాయాలు, ప్రణాళిక రూపకల్పన, పారిశుద్ధ్యం, రవాణా, గృహనిర్మాణం, నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల, పచ్చదనం, జలాశయాలకు పునరుజ్జివనం, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికలు, పట్టణాభివృద్ధి ఆధారిటీలు సహా ఎన్నో అంశాలపై ప్రభుత్వం చేపట్టిన చర్యలను, సాధించిన అభివృద్ధిని ఈ నివేదికలో వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ