కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తునట్టుగా శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాల రద్దుపై ప్రకటన చేయనున్నట్టు తెలిపారు. ప్రధాని ప్రకటనపై దేశవ్యాప్తంగా పలు పార్టీల ప్రముఖ నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ గొప్పది, తమ అలుపెరగని పోరాటం ద్వారా భారత రైతులు కోరుకున్నది సాధించారని మరోసారి నిరూపించారు. జై కిసాన్ జై జవాన్” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ