జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్ నగరంలోని పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మేయర్ గా గెలిచిన తర్వాత పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. రోహింగ్యాలను, పాకిస్తాన్ దేశీయులను తరిమి కొడతామని బండి సంజయ్ అన్నారు. కాగా బండి సంజయ్ వ్యాఖలను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్?! కొన్ని ఓట్లు, సీట్లు కోసం ఇలా మతిభ్రమించి మాట్లాడతారా? కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి, తన సహచర ఎంపీ చేసిన విద్వేషపూరిత, ఖండించదగిన వ్యాఖ్యలను సమర్థిస్తారా?” అని మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా టిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల కీలక నాయకులు ప్రచారంలోకి దిగడంతో నగరంలో రాజకీయ వాతావరణం రోజురోజుకి వేడెక్కుతుంది.
Surgical strike on Hyderabad?! Has this person gone completely insane for a few votes & seats!!@kishanreddybjp Garu, you are MoS for Home Affairs. Do you condone your colleague MP’s reprehensible, hate filled statements? #NoHatePolitics #HyderabadFirst https://t.co/Mhy9tr0j7f
— KTR (@KTRTRS) November 24, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ