జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీ నగర్ క్రాస్ రోడ్ వద్ద టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో ముషీరాబాద్ పరిధి డివిజన్లలో బీజేపీ, ఎంఐఎంలను ఓడించాలని పిలుపునిచ్చారు. గత ఆరేళ్లుగా నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఈ ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి రూ.2.70 లక్షల కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ కడితే, వాళ్ళు కేవలం రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన డబ్బులనే వారణాసి, పాట్నా, లక్నోకు తరలించి రోడ్లు వేసుకుంటున్నారని విమర్శించారు.
వరదసాయం కోసం కేంద్రానికి లేఖ రాస్తే ఎలాంటి జవాబు లేదన్నారు. అదీగాకా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వరదసాయానికి కూడా బీజేపీ నిర్దాక్షిణ్యంగా అడ్డుపడిందని చెప్పారు. ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తుంటే ఆపినోళ్లు, రేపు రూ.25 వేలు ఇస్తారా? అని మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం రూ.10 వేలు ఇచ్చిన ఆరున్నర లక్షల మంది జాబితాను బీజేపీ నాయకులకు పంపిస్తామని, వారందరికీ బీజేపీ తలా రూ.25 వేలు అందించాలని మంత్రి కేటిఆర్ సవాల్ చేశారు. హైదరాబాద్ నగరం మరింత గొప్పగా అభివృద్ధి చెందేందుకు ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించాలని ప్రజలను మంత్రి కేటిఆర్ కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ