గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు స్లిప్పులు పంపిణీ, పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులలో ఉన్న అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు తదితరులు గోప్యత పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయరాదని సూచించింది. ఇక పోలింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లు కూడా అనుమతించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ