హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటుగా జరగనున్న ఈ ఉత్సవాల్లో అన్నికార్యక్రమాలు త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ముచ్చింతల్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పర్యటించి, సహస్రాబ్ది వేడుకలలో పాల్గొన్నారు. ముచ్చింతల్ లోని ఆశ్రమానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. చినజీయర్ స్వామితో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన 216 అడుగుల స్వర్ణమయ శ్రీ రామానుజాచార్య విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. సమతామూర్తి విగ్రహం చుట్టూ తిరిగి నిర్మాణాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం యాగశాలలో అరణిమథనం, అగ్నిప్రతిష్ఠా, హోమాలు జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 5 వేల మంది రుత్వికులు యాగశాలలో 1035 కుండలాల్లో శ్రీలక్ష్మీనారాయణ హోమం నిర్వహించారు. అలాగే ఇష్టిశాష్టిలో దుష్టనిష్ట వారణకై శ్రీసుదర్శనేష్టి, సర్వాభీష్టసిద్ధికై శ్రీవాసుదేవెష్టి కార్యక్రమాలు, ప్రవచన మండపమంలో శ్రీశ్రీశ్రీ పెద్దస్వాద్ద స్వామివారి అష్టోత్తరశత నామపూజ, ప్రవచనములు జరిగాయి. గురువారం సాయంత్రం కూడా హోమాల నిర్వహణ, ముఖ్యఅతిథుల సందేశాలు ఉండనున్నాయి. ఆశ్రమంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు భక్తులు వేల సంఖ్యలో హాజరవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ