హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఎస్.ఆర్.డి.పిలో భాగంగా రూ.143.58 కోట్ల వ్యయంతో 990 మీటర్ల పొడవున నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్ను రేపు (అక్టోబర్ 26, బుధవారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ టూ వే ఫ్లైఓవర్లో 6 లేన్ క్యారేజ్వే ఉంది. అలాగే ఉప్పల్ నుండి ఎల్బీనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ డ్రైవ్ ఏర్పడడంతో పాటుగా, ఆ ప్రాంత పరిధిలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.
ఎస్ఆర్డీపీ కింద నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లను జీహెఛ్ఎంసీ, ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించి, అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్ పనులు పూర్తి కావడంతో రేపు అధికారికంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫ్లైఓవర్ తో ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ మరియు ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ మరియు ఆయా ప్రాంతాల నుంచే కనెక్టింగ్ జిల్లాలకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్య లేకుండా సులభంగా రాకపోకలు సాగించవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY