తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ముందుగా ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్, సరస్వతీ విగ్రహ షెడ్డు, సోలార్ ప్లానెట్ వంటివి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత 11.30 గంటలకు రూ.14 లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ మరియు 12 గంటలకు రూ.20 లక్షలతో నిర్మించిన మల్లాపూర్ పంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు.
అనంతరం మంత్రి కేటీఆర్, 12.30 గంటలకు దేశాయిపల్లిలో రూ.33 లక్షలతో నిర్మించిన ‘కేసీఆర్ గ్రామీణ ప్రగతి’ ప్రాంగణంతో పాటు రూ.14 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభిస్తారు. అలాగే రూ.20 లక్షలతో చేపట్టనున్న దేశాయిపల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు సిరిసిల్ల పట్టణంలోని షాదీఖానాను ప్రారంభించి, 1.30 గంటలకు రగుడు జంక్షన్ సుందరీకరణ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్టార్. తదనంతరం జిల్లా కలెక్టరేట్లో చైల్డ్ కేరింగ్ సెంటర్ను ప్రారంభించి, చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు సిరిసిల్ల ప్రెస్క్లబ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE