ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దూకుడు పెంచుతోంది. దీనిలో భాగంగా కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి పులివెందులలోని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఈ నెల10 తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయడం విశేషం. అందులో ఈ నెల 12వ తేదీన కడప జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలు కార్యాలయంలో సీబీఐ ముందు విచారణకు హాజరు కావాలని సూచించారు.
కాగా అంతకుముందు ఎంపీ అవినాష్ రెడ్డిని సోమవారం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావలసి ఉంది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో పాటు, ఇతర ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఈరోజు విచారణకు హాజరు కాలేనని ఆయన సీబీఐ అధికారులకు లేఖ రాశారు. దీంతో అందుకు అంగీకరించిన సీబీఐ అధికారులు, మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10 తేదీన విచారణకు కచ్చితంగా హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇంతకుముందు ఆయన రెండుసార్లు ఇదే కేసులో సీబీఐ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE