జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు ఢిల్లీలో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లను, తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలను కలిశాను. కమ్యూనిటీ సేవా ప్రయత్నాలపై దృష్టి పెట్టడం మరియు అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై మేము విస్తృత చర్చలు చేసాము. తెలంగాణలో సుపరిపాలన కోసం మరియు వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలికేందుకు బీజేపీ కృషి చేస్తుంది” అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ పై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.
గుజరాత్కు మాత్రమే నిధులా?:
మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, మోడీ జీ, సమాజ సేవ ప్రయత్నాలేనా?, మీరు గవర్నమెంట్ లేదా ఎన్జీవో నడుపుతున్నారా? అని అడిగారు. “హైదరాబాద్ వరద సహాయ నిధులపై ఏమైనా అప్డేట్ ఉందా?, మూసీ పునరుజ్జీవనం లేదా హైదరాబాద్ మెట్రో పొడిగింపు కోసం ఏదైనా ఆర్ధిక సహకారం ఉందా? ఐటీఐఆర్పై ఏదైనా అప్డేట్ ఉందా?, హైదరాబాద్/తెలంగాణ కోసం కేవలం పెదవిపై వచ్చే మాటలేనా?, గుజరాత్కు మాత్రమే నిధులా?” అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY