తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. గత సంవత్సరం జూన్ 15న భారత్-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కర్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
ఆ క్రమంలో సంతోష్బాబు స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉండేలా సూర్యాపేటలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు సూర్యాపేట కోర్టు చౌరస్తాలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంతోష్ బాబు ప్రథమవర్థంతి సందర్భంగా మంగళవారంనాడు మంత్రి కేటీఆర్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి, సంతోష్ బాబు కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ