బన్సీలాల్ పేటలో పునరుద్ధరించిన మెట్లబావిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Unveils the Restored Stepwell at Bansilalpet Hyderabad,Golconda Stepwell,Domakonda Fort,UNESCO Awards,Minister KTR Congratulated,Mango News,Mango News Telugu,UNESCO Awards For Golkonda Stepwell,UNESCO Awards For Domakonda Fort,UNESCO Latest News And Updates,Golconda Stepwell Route Map,Golconda Fort News and Updates,Domakonda Fort News And Live Updates,Minister Talasani Srinivas,Stepwell at Bansilalpet,Bansilalpet Stepwell Restored,Bansilalpet Stepwell,Minister KTR Unveils Bansilalpet Stepwell,Restored Stepwell at Bansilalpet,Bansilalpet Stepwell Hyderabad,Hyderabad Bansilalpet Stepwell

హైదరాబాద్ నగరంలోని బన్సీలాల్ పేట లో పునరుద్ధరించి, ఎంతో గొప్పగా అభివృద్ధి చేసిన మెట్ల బావిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెఛ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, స్థానిక నేతలు పాల్గొన్నారు. నిజాం కాలంలో ఈప్రాంత ప్రజల నీటి అవసరాల కోసం నిర్మించిన ఈ బావిని నాగన్నకుంటగా పిలిచేవారని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఈ బావి నిర్వహణను పట్టించుకోకపోవడం వలన వ్యర్దాలతో పూర్తిగా నిండిపోయింది. బావిలో నుండి 57 అడుగుల లోతు మేర సుమారు 500 టన్నులకు పైగా వ్యర్ధాలను తొలగించి, స్వచ్చమైన నీటితో నింపి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చారు. ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో హెఛ్ఎండీఏ, జీహెఛ్ఎంసీల ఆధ్వర్యంలో సాహే అనే ఎన్జీవో సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ పలు అభివృద్ధి, నిర్మాణ పనులను చేపట్టారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ పలుమార్లు ఈ మెట్లబావి పునరుద్ధరణ, పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో పరిశీలించారు. ఇక్కడ నూతనంగా టూరిస్ట్ ప్లాజా భవనం, అందులో మెట్ల బావి నమూనా, బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పురాతన పరికరాల గ్యాలరీ/ప్రదర్శన ఏర్పాటు చేశారు. చిన్న చిన్న వేడుకలను నిర్వాహించుకొనే విధంగా సీటింగ్ తో కూడిన గార్డెన్, యాంపీ థియేటర్ నిర్మాణంతో పాటుగా మెట్లబావి పరిసరాలలో నూతనంగా వీడిసీసీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు.

మెట్లబావిని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 13 నెలలు పాటుగా ఎంతో శ్రమించి బన్సీలాల్ పేట మెట్లబావికి కొత్త వైభవం తీసుకువచ్చిన అందరికి, పనిచేసిన అన్ని డిపార్ట్మెంట్స్ వారికీ, పారిశుద్ధ్య కార్మికులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 9 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించానని, మెట్లబావిని ప్రారంభించడం మరింత ఆత్మ సంతృప్తిని కలిగించిందన్నారు. నగరం అంటే చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదకు గుర్తు అని, ఈ మెట్లబావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే, ఈ నగరాన్ని మెరుగైన పద్ధతుల్లో భవిష్యత్ తరాలకు అందించిన వాళ్లమవుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − two =