తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుండి ఆగష్టు 15 వరకు ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 25 వ తేదీన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్ పేటలో గల సత్యం దియేటర్ వద్ద మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు లక్ష్యమని, ఆయన ఆదేశాల మేరకు ఈ నెల 25 వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగా జీహెఛ్ఎంసీ ఆధ్వర్యంలో 2.50 కోట్లు, హెఛ్ఎండీఏ ఆధ్వర్యంలో 5 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళికలను సిద్దం చేయడం జరిగిందని తెలిపారు.. అనంతరం బల్కంపేట గ్రేవ్ యార్డ్ లో మొక్కలు నాటుతారని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్వచ్చంద సంస్థల నిర్వహకులు, కాలనీ సంఘాలు భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు.
మరోవైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26 వ తేదీ నుండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెఛ్ఎంసీ పరిధిలోని వివిధ నియోజవర్గాలలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. 26 వ తేదీన సనత్ నగర్, ముషీరాబాద్, అంబర్ పేట, 27 వ తేదీన సనత్ నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, 28 వ తేదీన గోషా మహల్, నాంపల్లి, కార్వాన్, 29 వ తేదీన కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, 30 వ తేదీన ఉప్పల్, ఎల్బీ నగర్, మలక్ పేట నియోజకవర్గాల పరిధిలో పర్యటించి మంత్రి తలసాని మొక్కలను నాటుతారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu