తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. సీఎం కేసీఆర్ సిఫారసు మేరకు మంత్రి ఈటల రాజేందర్ ను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి తొలగిస్తున్నట్టు ఆదివారం రాత్రి ప్రకటించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు.
ముందుగా ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ కు బదిలీ చేశారు. తాజాగా మంత్రివర్గం నుంచి కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు భూకబ్జా ఆరోపణలపై అచ్చంపేటలో విచారణ కొనసాగుతుంది. ప్రాథమిక విచారణ అనంతరం కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్ భూమి ఉన్నట్లు తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ విచారణకు సంబంధించిన నివేదికను సీఎస్కు అందించారు. నివేదిక నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ను తొలగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ